Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వా స్పత్రుల్లో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన వైద్య అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ మున్సిపల్ కాలనీలోని ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేటర్ పులి జగన్తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.ఆస్పత్రిలో వసతులను వైద్యులను సిబ్బందిని అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి రోజూ ఔట్ పేషెంట్ విభాగానికి వందకుపైగా వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మం దులు అందజేస్తున్నామని, 10 నుంచి 20 వరకు గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేస్తున్నామని వారు తెలిపారు. వ్యాధిగ్రస్తులను వైద్య నిర్వాహణ ఎలా ఉందని ఎమ్మెల్యే కాలేరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల రూ.45 లక్షల వ్యయంతో ధవాఖానాలో సౌకర్యాల కల్పనతో పాటు ఆధునీ కరించామని తెలిపారు. ఆవరణలో గల జాగాలో మట్టిని తొలగించి టైల్స్ వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరో రూ.7 లక్షల వ్యయంతో యుద్దప్రాతిపధికన అసంపూర్తిగా మిగిలిన పనులను పూర్తి చేయడంతో పాటు అవసరమున్న వైద్యులను, సిబ్బందిని నియమించి వచ్చే నెల మొదటి వారానికల్లా పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు.జనరల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్టు వైద్య సేవలను మరింత విస్తృత పరుస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ డీఈ అమరేందర్, వైద్యాధికారులు రామారావు, శ్రీదేవితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.