Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ శాసన మండలిచైర్మన్ స్వామిగౌడ్
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
మారుతున్న కాలంలో బంజారాల సంస్కృతి, భాషా, ఆచార వ్యవహారాలు మరుగున పడకుండా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ 280వ జయంతి ఉత్సవాల సందర్భం గా మహబోగ్ బండా రో.. సేవాలాల్ మ హరాజ్ పురస్కారం బంజారాల జీవన శైలి చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, అనేక మంది బంజారాలు సర్పంచ్లుగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశాలు ఇచ్చిందన్నారు. సేవాలాల్ మహరాజ్ బంజారాలకు గురుతుల్యులు అని ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలి పారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ గంగా, జమున, తెహజీబ్ అనే ఐక్యతకు నిదర్శనం తెలంగాణ ప్రభుత్వమని అన్ని సంస్కృతులను గౌరవించ డం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ప్రతిఏటా సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తూ, ఆయనను శాశ్వతంగా నిలుపుతున్న శంకర్ నాయక్ అభినందనీయులన్నారు. హైదరాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రవి గుగులోతు మాట్లాడుతూ తండాల అభివృద్ధికి సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో నడవాలని అన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ గిరిజన, లంబాడీల పండుగలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బంజారా సాధువులకు దీపనైవేద్యం కింద రూ.6వేలు, రెండు జతల సాధువస్త్రాలను ఇవ్వాలని బంజారాలకు కళ్యాణ మండపం నిర్మించాలని కోరారు. వేదికపై టీఆర్ఎస్ నాయకులు వి. నాయక్, రాంబాబు నాయక్, బొజ్జ మహరాజు, రాజు నాయక్, శ్రీను నాయక్, రూప్సింగ్ నాయక్లు పాల్గొన్నారు.