Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
రాజ బహదూర్ వెంకటరామరెడ్డి మహిళా కళాశాల డిగ్రీ అండ్ పీజీ పరీక్షలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శారధ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ కె.స్వప్న తెలిపారు. శుక్రవారం నారా యణగూడలోని కళాశాలలో ఆమె మాట్లాడుతూ డిగ్రీలో 2007 నుంచి 2018 వరకు, పీజీలో 2005 నుంచి 2018 విద్యా సంవత్సరం వరకు వివిధ కోర్సుల్లోని సబ్జెక్ట్ల్లో ఫెయిల్ అయిన విద్యార్థినీలకు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం పరీక్ష రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా సబ్జెక్ట్లలో ఫెయిల్ అయిన విద్యార్ధులు మార్చి 15వ తేదీలోగా పూర్తి చేసిన ధరఖాస్తులను కళాశాలలో అందిం చాలని సూచించారు. మార్చి 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వివరాలకు కళాశాల ఎగ్జామినేషన్ బ్రాంచిలో గానీ, 040-27550271, 27567778 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.