Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిమాండ్ల సాధనకు ఈనెల 18 నుంచి 20 వరకు మూడురోజుల సమ్మె
ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రజా ప్రయోజనాలకే బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోం దని, దానిని కాపాడుకుందామని ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఆల్ యూనియన్స్ అండ్ అసోస ియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్ టెలికాం జిల్లా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్రెడ్డి మాట్లాడుతూ 2002లోనే మొబైల్ సేవలు ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవలు అందించిన సంస్థ బీఎస్ ఎన్ఎల్ మాత్రమేనని గుర్తు చేశారు. గిట్టుబాటు కానప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్న ల్యాండ్ లైన్ సేవలకు పూర్తి నష్టపరిహారం ఇస్తామన్న హామీని సైతం ప్రభుత్వాలు ఉల్లంఘించాయని ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ను నష్టాల పాలు చేస్తూ ప్రయివేటు టెలికాం కంపెనీలను అనుచిత రాయితీలతో ప్రోత్స హించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవల విస్తరణకు అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో మొబైల్ సేవలు వెనుకబడ్డాయన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తిరస్కరించటమే కాకుండా బీఎస్ఎన్ఎల్ను ప్రయివేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరో పించారు. వేతన సవరణ, పెన్షన్ సవరణ వంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజులు సమ్మె చేపడు తున్నామని అన్ని సంఘాలు, ప్రజలు కలసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాంబశివరావు, ముత్తు, రమేష్, మూర్తి, అంజయ్య, సాయిగౌడ్, పద్మావతి పాల్గొన్నారు.