Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పక్క రాష్ట్రంలో గర్జించడం కాదని, సొంత రాష్ట్రంలో బీసీల హక్కుల సాధన కోసం గర్జించాలని మహేశ్వరం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల అరవింద్కుమార్ సూచించారు. శుక్రవారం సరూర్నగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తలసాని శ్రీనివాస్యాదవ్కు దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50 శాతం టికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో బీసీల హక్కుల కోసం శంఖారావం పూరించాల్సిన అవసరం లేదన్నారు. బీసీల మీద ఆయనకు ప్రేమ ఉంటే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 50 శాతం మంత్రి పదవులు ఇప్పించాలన్నారు. తనకు మంత్రి పదవి దక్కదేమో అన్న భయంతో ఆంధ్రాకు వెళ్లి బీసీల మీద మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. జగన్తో జరిగిన లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తలసాని ఆంధ్రాలో పర్యటిస్తూ తరచూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు.