Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
రాంకీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని జీఎహెచ్ఎంసీ వెంటనే ఉపసంహరించుకోవాలని మల్కాజిగిరి మండల సమితి సీపీఐ, ఏఐటీయూసీ అధ్యక్షతన పట్టణ టి యాదయ్యగౌడ్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఒప్పందం రద్దు చేయని యెడల ఈ నెల 19న చలో జీహెచ్ఎంసీ ముట్టడి చేస్తామని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో పనిచే స్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు, అవుట్సోర్సింగ్ కార్మికు లందరినీ పర్మినెంట్ చేయాలని, అలాగే కనీస వేతనం రూ.24 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈఎస్ఐ, పీఎఫ్ను పకడ్భందీ గా అమలు చేయాలని, బయోమెట్రిక్ హాజరులో నెలకొన్న అవకతవకలను అరికట్టాలని ఆయన కోరారు.ఉద్యోగ కార్మిక సంఘాలు ఒకే తాటిపై వచ్చి కార్మిక సమస్యల కోసం జీహెచ్ఎంసీని ముట్టడి చేయాలని, కార్మికుల వేతనాలు పెంచేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని వారు కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాదయ్యగౌడ్, ఏఐవైఎఫ్ మహిళ కార్యదర్శి అబ్ధుల్ ఫణి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి వెంకట్, మండల ఉపాధ్యక్షులు శంకర్గౌడ్, రమణ, సీనియర్ నాయకులు ఎం లింగం తదితరులు పాల్గొన్నారు.