Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఎండీఏ డీఎస్పీ గ్యార జగన్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
క్రీడలు మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహద పడుతాయని హెచ్ఎండీఏ డీఎస్పీ గ్యార జగన్ అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో జాతీయ కబడ్డి క్రీడాకారుడు మునుకుంట్ల రమేష్ గౌడ్ 23వ మెమోరియల్ కబడ్డి టౌర్నమెంట్ ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిóగా హాజరై మాట్లాడుతూ.. క్రీడలు యువకుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహద పడుతాయని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది క్రీడాకారులకు క్రీడలు నిర్వహించి, యువకులను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న నిర్వహకులను అభినందించారు. పోస్టల్ డిపార్టుమెంట్, ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్కు జరిగిన ఫైనల్లో పోస్టల్ డిపార్టుమెంట్పై 13-18 స్కోర్తో గెలుపొందిన ఇన్కం ట్యాక్స్ డిపార్టు మెంట్కు రూ.2500 నగదు బహుమతి అందించారు. రన్నరప్గా నిలిచిన పోస్టల్ డిపార్టుమెంట్కు రూ.1500 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొర్రెముల ఉపసర్పంచ్ కందుల రాజు, పోచారం ఎంపీటీసీ చెరుకు బద్రి నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ భైనగారి నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ నాగార్జున, రమేష్ హన్మాన్ యూత్ క్లబ్ అధ్యక్షులు మునికుంట్ల సంతోష్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎం. సంతోష్ కుమార్ గౌడ్, జగత్, తిరుమల్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.