Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మండలంలోని వివిధ గ్రామాలల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మేడ్చల్ పట్టణంలో నిర్మించతలపెట్టిన రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు, మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణం శ్రీరంగవరం గ్రామంలో రూ.25లక్షల పలు అభివృద్ధి పనులు, లింగపూర్ గ్రామంలో రూ.20లక్షల నిధులతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ,ఎంపీపీ విజయలకిë, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నందరెడ్డి,ఎంపీడీవో పద్మవతి, సర్పంచ్లు విజయేందర్ రెడ్డి,చెన్నలకిë, సింగిల్ విండో చైర్మన్ అంతిరెడ్డి, రజక సంఘం నాయకులు పంజగారి ఆంజనేయులు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు రవిందర్ రెడ్డి, మండల కార్యదర్శి భాగ్యరెడ్డి నాయకులు మద్దుల శ్రీనివాస్రెడ్డి, నరసింహరెడ్డి, విష్ణుచారి, తుడం గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.