Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
సికింద్రాబాద్లోని బస్తీల్లో నివాసముండే ప్రజలు కుక్కల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ ఎంసీ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసిన్నప్పటికి వారు తమ సమస్యల పట్ల చొరవ చూపకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో తుకారాంగేట్ వద్ద గడ్డమీది బస్తీలో చిన్న పిల్లలను కుక్కలు కరవడంతో ఆస్పత్రుల పాలయ్యారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు బస్తీ వాసుల మీద చొరవ చూపి కుక్కల బెడద నుంచి తమకు రక్షించాలని కోరుతున్నారు.