Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ రోడ్డు ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, రోడ్డు నాణ్యతలో ఎలాంటి అక్రమాలు జరిగిన, రోడ్డు దెబ్బతిన్న అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని హెచ్చరించారు. డివిజన్లోని సమస్యలను స్థానిక కాలనీ అసోసియేషన్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రతాప్రెడ్డి, సత్యనారాయణ, శివప్రసాద్ పాల్గొన్నారు.
కాలనీ అసోసియేషన్ నాయకులు వినతి :
హెచ్బీ కాలనీ ఫేజ్-1 పార్కు వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అందుకు కారణమైన ఫుట్ఫాత్పై ఉన్న అక్రమాలను తొలగించాలని ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గొల్లూరి అంజయ్యకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే అక్రమాలను తొలగించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కాలనీ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, అధ్యక్షులు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.