Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన పలువురిని లేక్ పోలీసులు రక్షించారు. ఈ సందర్భంగా లేక్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొందరు ఆకతాయిలు తమ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవమానంగా భావించిన ఓ ప్రేమ జంట హుస్సేన్ సాగర్లో దూకేందుకు యత్నించగా లేక్ పోలీసులు వారిని రక్షించారు. వీరు గజ్వేల్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి14న సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద వీరిద్దరూ కలసి ఉన్న సమయంలో కొందరు ఆకతాయిలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మనస్తాపం చెంది, ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకోడానికి యత్నించారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న పెట్రోలింగ్ పోలీసులు గమనించి వారిని రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి, మరల ఇటువంటి పని చేయ రాదని వారికి సూచించారు. మరో మూడు ఘటనల్లో కూడా లేక్ పోలీసులు ముగ్గురిని రక్షించారు. అందులో ఒకటి హుస్సేన్ సాగర్లో దూకేందుకు ప్రయత్నించిన ఓ మహిళను కాపాడారు. ఆమెను విచారించగా కుటుంబ కలహాలతో నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. లేక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. రెండో ఘటనలో చిట్టీలు నడిపిస్తున్న ఓ వ్యక్తి అందరికీ సరైన సమయానికి డబ్బులు ఇచ్చినప్పటికీ, ఒక వ్యక్తికి రూ.40 వేల అప్పుపడ్డాడు. దీంతో ఆయన రోజు వేధిస్తున్నాడని అందుకే ఆత్మహత్యకు పూనుకున్నట్టు వివరించాడు. దీంతో లేక్ పోలీసులు అతడిని పిలిపించి కొద్ది కొద్దిగా నీ అప్పు తీరుస్తాడని చెప్పి ,మరల అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మూడో ఘటనలో 70 ఏండ్ల వద్ధురాలు కుటుంబకలహాలతో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా లేక్ పోలీసులు ఆమెను కాపాడి, కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.