Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
కమలానగర్లో రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
వికలాంగుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. శుక్రవారం కమలానగర్లో ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగు లను పేరు మార్చి దివ్యాంగులుగా ప్రకటించిన మోడీ వికలాంగుల సంక్షేమానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిం చారు. దేశంలో వికలాంగులపై దాడులు పేరుకుపోతు న్నాయని వివరించారు. బడ్జెట్లో 5 శాతం నిధులు కేటా యించడం లేదని వికలాంగుల నిధులను దారి మళ్లించా ల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగాల్లో 4 శాతం ఎందుకు భర్తీ చేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో వికలాంగుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారనిచెప్పారు. వికలాంగుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఏంటో మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది వికలాంగులు ఉంటే నాలుగు లక్షల 93 వేల మం దికే పింఛన్లు అందజేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు సాయమ్మ, రాష్ట్ర కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షులు కవితారెడ్డి, యశోద రాజు, సహాయ కార్యదర్శులు గంగాధర్, నాగలక్ష్మి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కురునెల్లి వెంకట్, రాష్ట్ర నాయకులు అపన్అలీ, చంద్రమోహన్, శంకర్ పాల్గొన్నారు.