Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీసీలు, మెడికల్ ఆఫీసర్ల ప్రమేయంపై ఆరా
రాజకీయ జోక్యం లేకుండా 'కోడ్' తర్వాతే తనిఖీలు
ప్లాన్ రూపొందించిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చర్చనీయాంశంగా మారింది. బోగస్ కార్మికులను అరికట్టేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. బోగస్కార్మికులు లేకుండా చేయాలని బల్దియా భావిస్తే బోగస్(సింథటిక్) వేలిముద్రలతో కార్మికుల వేతనాలు కాజేసిన ఘనులు జీహెచ్ఎంసీలోనే ఉన్నారని విజిలెన్స్ విభాగం తనిఖీలతో బయపడిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలు నగరాన్ని
షేక్ చేశాయి. దీంతో స్థానిక కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా అధికారులు తనిఖీలు నిలిపేశారు. రాజకీయ ఒత్తిడితోనే నిలిపేశారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతుంది.
జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చర్చనీయాంశంగా మారింది. బోగస్ కార్మికులను ఆరికట్టేందుకుగాను బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే బోగస్కార్మికులు లేకుండ చేయాలని బల్దియా భావిస్తే బోగస్(సింథటిక్) వేలిముద్రలతో కార్మికుల వేతనాలు కాజేసిన ఘనలు జీహెచ్ఎంసీలోనే ఉన్నారని విజిలెన్స్ విభాగం తనిఖీలతో బయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీలు నగరాన్ని షేక్ చేశాయి. దీంతో స్థానిక కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా అధికారులు తనిఖీలు నిలిపేశారు. రాజకీయ ఒత్తిడితోనే నిలిపేశారని అధికారవర్గాల్లో చర్చజరుగు తుంది. విజిలెన్స్ విభాగం మంచి పనిచేసినా..సరైన సమయంలో చేయాలని పలువురు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. విమర్శలు, ప్రశంసల నేపథ్యంలో తాత్కాలికంగా తనిఖీలు నిలిపేశారు. అయితే అదునుచూసి దెబ్బకొట్టాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం భావిస్నున్నది. దీనికి సంబంధించిన ఏకకాలంలో దాడులుచేసేవిధంగా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
తనిఖీల్లో...
జీహెచ్ఎంసీలో నకిలి వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల హాజరును నమోదు చేస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం బందాలు నగరంలోని 12 ప్రాంతాల్లో శానిటరి ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్ఎఫ్ఏ)లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 84 కత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్, మలక్పేట్, కూకట్పల్లి, ఎల్బీనగర్, బాలానగర్, జగద్గిరిగుట్టలో 12 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా 84 కత్రిమ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. 17మంది ఎస్ఎఫ్ఏలను విచారించగా 9మంది వద్ద ఈ నకిలీ ఫింగర్ ప్రింట్స్ను గుర్తించారు. పారిశుధ్య విభాగంలో అవకతవకలను నివారించేందుకు జీపీఎస్, ఆధార్, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని జీహెచ్ఎం సీలో అమలు చేస్తున్నారు. అయినా అక్రమాలు ఆగడం లేదు. అక్రమాలకు పాల్పడిన 9మంది ఎస్ఎఫ్ఏలను విధుల్లోంచి తొలగించారు.
డీసీలు, మెడికల్ ఆఫీసర్లపై..
పారిశుధ్య విభాగంలో జరిగిన అవకతవకలపై సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్ల పాత్రపై విజిలెన్స్ విభాగం ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎస్ఎఫ్ఏలు సింథటిక్ ఫింగర్ ప్రింట్స్తో బోగస్ హాజరువేస్తుంటే డీసీలు,మెడికల్ ఆఫీసర్లకు తెలియకుండ ఎలా ఉంటుంది? తెలిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు?ఆ కార్మికుల వేతనాల డబ్బులు ఎవరెవరు పంచుకుంటున్నారు? కార్పొరేటర్ల పాత్ర ఉందా? అనే కోణాలపై ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అవకతవకల్లో ప్రమేయమున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు, కార్పొరేటర్లపై పార్టీ, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేవిధంగా కసరత్తుచేస్తున్నట్టు సమాచారం.
కోడ్ సమయంలో..
పారిశుధ్య విభాగంలో అవకతవకలపై జనవరి 30న జరిగిన విజిలెన్స్ తనిఖీలకు బ్రేక్ పడింది. అందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని సమాచారం.అయితే రెండో దఫాలో అదనుచూసి దెబ్బకొట్టేందుకు విజిలెన్స్ విభాగం కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ రాగానే తనిఖీలు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు ఏకకాలంలో అన్ని సర్కిళ్లలో తనిఖీలు చేసేవిధంగా ప్లాన్ రూపొందించినట్టు తెలిసింది.