Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరిగి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నం
హత్యకేసులో మరికొందరి పాత్రపై అనుమానాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణలో తవ్విన కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తు న్నాయి. జయరాం హత్యలో ఐదుగురు పాల్గొని ఉండవచ్చని పోలీ సులు అను మానిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్నగర్కు చెందిన నగేశ్, విశాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిద్దరిని ప్రశ్నించారు.రాకేశ్రెడ్డి, జయరామ్కు మధ్య రూ.4.5కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. జయరాంను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకే ఇంటికి పిలిపించి పాచిక పారకపోవడంతో హత్య చేశాడా..అనే మిగతా 4లో...
కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈకేసు లో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. వారితోపాటు మరో ముగ్గురు పోలీసు అధికారులతో రాకేశ్రెడ్డి ఫోన్లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలు స్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండటంతో శుక్రవారం రాత్రి వరకు రాకేశ్రెడ్డిని పోలీసులు విచారించారు. అయితే మూడు రోజుల కస్టడీ ముగియడంతో శనివారం ఉదయం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. తిరిగి కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కస్టడీ పొడిగించాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించనున్నారు.
పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. జయరాం హత్య అనంతరం రాకేశ్రెడ్డితో టచ్లోవున్నట్టు ఆరోప ణలు ఎదర్కొంటున్న ఏసీపీ, సీఐలను హెడ్క్వార్ట్ర్కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నేరస్తునికి సలహాలు అందించినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసి వారిని విచారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడైనా నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, దాన్ని కప్పి పుచ్చడం నేరంగానే పరిగణించే పోలీసులు ఏకంగా నేరస్తునితో అంటకాగిన పోలీసులపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైన దోపిడీ కేసులో దొంగ సొత్తును కొనుగోలు చేసిన సమయంలో నేరస్తులతోపాటు రిసీవర్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించే పోలీసులు సొంత శాఖకు తలవంపులు తీసుకొస్తున్నవారిపై కఠిన చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జయరాం హత్య కేసులో ఏసీపీ, సీఐతోపాటు మరికొంత మంది ఏకంగా నేరస్తునితో టచ్లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అలాంటి సమయంలో నేరస్తులతో అంటకాగిన వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తే మరొకరు తప్పుచేయకుండా ఉండే అవకాశముందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసులో పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు చేపడ్తారోనిని నగరవాసులు ఎదురు చూస్తున్నారు.