Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రొఫెసర్ కె .నాగేశ్వర్రిజర్వేషన్లు రిప్రజంటేషన్
-అండ్ సోషల్ జస్టిస్పై సెమినార్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
రాజ్యాంగంలో రిజర్వేషన్లు అంతర్భాగమని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఓయూ గెస్ట్ హౌస్ లో ''రిజర్వేషన్లు రిప్రజంటేషన్ అండ్ సోషల్ జస్టీస్'' అంశంపై జాతీయ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా కులాలను రిజర్వేషన్ నుండి తొలగించుకోవచ్చు కానీ జత చేయటం వీలుపడదన్నారు. మత పరమైన రిజర్వే షన్లు రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ఇందిరా సహని కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నత కాలం అభివద్ధిని సాధించలేమని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న నాలెడ్జ్ అకాడమిలో 90శాతం అగ్రకులాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రతినిధ్యం లేదని, రిజర్వేషన్లు అవసరం ఉందని చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే సామాజిక న్యాయం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ కష్ణరావు, కన్వీనర్ డీన్ ఆచార్య నాయుడు అశోక్, పొలిటికల్ సైన్స్ హెడ్ బ్రహ్మనందం , డాక్టర్ లావణ్య, డాక్టర్ రాజేష్ ఆచార్యులు అడపా సత్యనా రాయణ, తిరుమలి, లక్ష్మణ్, వెంకట్, బంగ్యా, సురేపల్లి, సుజాత పాల్గొన్నారు.