Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మంత్రి శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-రాంనగర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం ఆమ్ధారా ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఎన్నికల సమయంలోనే హిందూ మతం గుర్తు కొస్తుందన్నారు. బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఘాటుగా విమర్శించారు. చివ రికి రాంనగర్లోని ఆయన నివాసం ముందు టీఆర్ఎస్ పార్టీ రోడ్డు వేయిం చిందని గుర్తు చేశారు. యువకుడు విద్యావం తుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు
ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ సికింద్రా బాద్ లోక్సభ స్థానాన్ని పోటీ చేస్తున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాం డింగ్ కమిటీ సభ్యులు రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, ముషీరాబాద్ కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్, టీఆర్ఎస్ యువ నాయకులు మూట జై సింహ, సీనియర్ నాయకులు మచ్చ కుర్తి ప్రభాకర్, ప్రకాష్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.