Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి, పూటకో పార్టీ మారుస్తూ కాలయాపన చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్సెల్ కన్వీనర్ రామిడి శూరకార్ణారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట మున్సిపాలిటి పరిధిలో అల్మాస్గూడ గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన కౌన్సిలర్లు ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకకుండా పరిష్కారం చేస్తామని హామి ఇచ్చి వారితో ఓట్లు వేయించున్నారు. అధికారంలోకి రాగానే ప్రస్తుత సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యంగా గ్రామంలో 7, 8, 9 వార్డుల్లోని పలు కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, వీధిదీపాలు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయాల్సిన నాయకులు తమ సొంత వ్యాపారాలు చేసుకుంటూ సమస్యలను పట్టించుకోవటంలేదన్నారు. కాలనీల్లో ప్రజలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధదులను కోరితే పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. కాలనీల్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా వాటిని కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్న పేదలకు సంబందించిన బ్యాంకు రుణాలను మాఫీ చేయిస్తామని హామి ఇచ్చి నేటికి మాఫీ చేయలేదన్నారు. సాయిబాలాజీ టౌన్షిఫ్ను బడంగ్పేట మున్సిపాలిటిలో విలీనం చేయటానికి కృషి చేస్తామని హమీ ఇచ్చి నేటికి విలీనం చేయలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.ఐలయ్యయాదవ్, వినరుయాదవ్, విఘేశ్వర్రెడ్డి, శశివర్దన్రెడ్డి, రవితేజ, రోహన్ పాల్గొన్నారు.