Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు మల్లెపాక వీరయ్య
నవతెలంగాణ-ఎల్బీనగర్
సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు మల్లెపాక వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం దిల్సుఖ్నగర్లోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రొడక్టర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ సమావేశంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. సామాన్యుల నుండి సంపన్నుల దాక వినోదాన్ని పంచుతున్న సినిమా రంగంలో పని చేస్తున్న కార్మికులకు మాత్రం సరైన జీతభత్యాలు, ఉద్యోగభద్రత లేక కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సినిమా థియేటర్ యాజమాన్యాలు స్పందించి థియేటర్స్లో పని చేస్తున్న ఆపరేటర్స్కు, కార్మికులందరికీ వేతనాలు పెంచి ఈఎస్ఐ, పీఎఫ్ అవకాశాలు ప్రతి కార్మికునికి కల్పించాలన్నారు. లైసెన్స్ ఉన్న ఆపరేటర్స్ను మాత్రమే పనిలో పెట్టుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆలేటి ఎల్లయ్య, వెంకన్న, మనోహర్, వైస్ ప్రెసిడెంట్ పీ.మనోహర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనారాయణ, రమేష్, సత్తయ్య, కోటేశ్వరావు, దుర్గాప్రసాద్, రాములు తదితరులు పాల్గొన్నారు.