Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా 25 ఏండ్ల వార్షికోత్సవ వేడుకలు..
- అంబరాన్నంటిన సంబురాలు..
నవతెలంగాణ- ధూల్పేట్
విద్యార్థుల విద్యాతో పాటు కాలాను మానంగా విద్యార్థులను రాణించేందుకు విద్యా శ్రీ స్కూల్ ప్రత్యేకతను చాటుకుంది. జియాగూ డలోని విద్యాశ్రీ హైస్కూల్ వార్షికోత్సవ వేడు కలు నెల 25న సాయంత్రం 6 గంటలకు కార్వాన్ ఎస్బీఎ గార్డెన్లో 'విద్యాశ్రీ కల్చరల్ ఫస్టివల్-2019' వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్, తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్వెరా, పాఠశాల డైరెక్టర్ సునిత అన్నారు. జియాగూడలో 29 ఏండ్లగా విద్యాబోధనలు అందజేస్తున్నారు. శనివారం స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జీయా గూడలో విద్యాభివృద్దితో పాటు క్రీడలు, యోగా పోటీలు తదితర వాటిలలో విద్యార్థు లకు ప్రత్యేక శిక్షణలు ఇస్తుండడంతో వారు అంతర్జాతీయ క్రీడల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమం త్రి డాక్టర్.వైఎస్ రాజశేఖర్రెడ్డి చేతుల మీదగా పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ అవార్డులను అందుకున్నారన్నారు. సోమవార ం సాయంత్రం జరిగే విద్యాశ్రీ కల్చరల్ ఫెస్లివల్-2019 వేడుకల్లో 23 ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. పాఠశాల ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు రీడింగ్, రైటింగ్, స్పోకెన్, యోగా తదితర వాటిలలో ప్రత్యేక శిక్షణల పట్ల కార్యక్రమం ప్రతి ఏటా స్కూల్లో సైన్స్ అండ్ ఆర్ట్స్, క్రాఫ్స్ ప్రదర్శనలు, ఆజ్ హై సండే, కవాలి, ప్రకృతిని ఎలా కోల్పొతున్నాం, ఎలా రక్షించుకోవాలి, రిమిక్స్, ఇండియన్ కల్చరల్, సౌత్ ఇండియన్ కల్చరల్, తెలంగాణ బోనాలు, బతుకమ్మ వేడుకల సంబరాలు, నేషనల్ ఇంటిగ్రేషన్, కార్గిల్ యుద్ధ వీరుడు సత్యనారాయణ జీవిత విశేషాలు, ఫన్ని డ్యాన్స్ తదితర కార్యక్రమాలు ఎన్నో ఉంటాయని, ఎంతో ఆకట్టుకుంటాయని వారు తెలిపారు.