Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాలన్స్ ఉంటేనే వెలుగులు..! లేకపోతే చీకటే..!!
- తొలుతగా ప్రభుత్వ కార్యాలయాల్లో
- రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన
కేంద్రం
- అమలుకు ఆలోచన చేస్తున్న రాష్ట్రం
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యుత్ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇంతకాలం మెబైల్, టీవీ, ఇంటర్నెట్, ల్యాండ్ఫోన్ లకు పరిమితమైన ప్రీపెయిడ్ వ్యవస్థ రానున్న రోజుల్లో కరెంట్కు కూడా పరిమితం కానుంది.ఇప్పటి వరకు వినియోగదారులు తాము విద్యుత్తును వినియోగించుకున్న తరవాత బిల్లును చెల్లించే పద్దతి ఉంది. కానీ ఇప్పుడు ''ఆఫ్టర్ పేయిడ్'' విధానానికి స్వస్తి పలుకుతూ ''ప్రీపెయిడ్'' విదానం అమలు చేయాలన్న ఆలోచనకు వచ్చింది.ముందస్తుగా నగదును చెల్లిస్తేనే అందుకు తగ్గ విద్యుత్తును ఇళ్లకు సరఫరా చేస్తారు. దీంతో ముందస్తు రిచార్జ్ చేసుకోకపోతే ఫోన్ మూగబోయినట్టు మీ ఇళ్లు కూడా చీకటిగా మారనున్నాయి.
తొలిదశలో...
సెల్ఫోన్కు ప్రీపెయిడ్ నంబరు తీసుకుని ఎప్పటికప్పుడు రీఛార్జి చేయిస్తున్నాం కదా.... అలాగే మీ ఇంట్లో వాడుకునే కరెంటుకు కూడా ముందే నగదును చెల్లించి రీఛార్జి చేయించు కుంటేనే కరెంటు సరఫరా అవుతుంది. లేదంటే సరఫరా నిలిచిపోనుంది.ఈ పరిస్థితి దేశమం తటా 2022 చివరికల్లా తీసుకురావాలని కేంద్రం తాజాగా గడువు నిర్ణయించుకుంది.ఈ అంశంపై దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర విద్యుత్శాఖ సమావేశం ఏర్పాటుచేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారు లతో చర్చించి, స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం.తెలంగాణ దక్షిణ డిస్కం అధికారులు ఈ సమావేశంలో పాల్గోని పలు సూచనలిచ్చినట్లు సమాచారం. ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని ప్రాథమికంగా రాష్ట్రాలు అంగీకరించాయి. తొలిదశలో నగరాల్లోని పరిశ్రమలకు తర్వాత ధశల వారిగా...గృహాలకు కేటాయించాలని నిర్ణయించారు.
ఇక రాష్ట్రమంతటా పవర్ ప్రీపెయిడ్ సర్వీసులు ..
ప్రతి కరెంటు కనెక్షన్కు ప్రస్తుతం సాధారణ మీటర్లు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగి మీటరు రీడింగ్ ఆదారంగా బిల్లు ఇస్తున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో బిల్లుల వసూలు 100 శాతం జరగడం లేదన్న పిర్యాదులన్న దృష్ట్యా ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు సిద్దపడుతున్నాయి.
ఒకేసారి అమలుకు కష్టం..
ఒకేసారి దేశమంతటా ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు అసాధ్యమని రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధుల బృంధం తేలిపింది.అయితే తొలుత నగరాల్లో పరిశమ్రలకు అమలు చేసి క్రమేణా గృహలకు విస్తరించాలన్న ఆలోచనలు చేసింది. ప్రస్తుతం సాధారణ మీటర్ల ధర సింగిల్ ఫేజ్ దైతే 750 త్రీఫేజ్ది 1500 దాకా అవుతోంది. వాటిని తొలగించి ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలంటే సింగిల్ ఫేజ్కు 3 వేలు, త్రీఫేజ్కు 6 వేలు చెల్లించాలి. మొత్తంగా కోటి మీటర్లు కొంటా మంటే తక్కువ ధరకు తయారుచేయడానికి కంపెనీలు ముందుకొస్తాయని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ తెలంగాణలో పరిస్థితి..
ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలంటున్న అధికారులు..!!
తెలంగాణలో మొత్తం 1.17 కోట్లకు పైగా కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలంటే కనీసం 4 వేల కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇంత సొమ్మును సొంతంగా భరించే శక్తి తమకు లేదని.. కేంద్రం 60 శాతానికి తగ్గకుండా భరించాలని డిస్కంలు కోరాయి. వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వీటి ఏర్పాటును దశల వారీగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. తెలంగాణలో తొలిదశలో నెలకు 500 యూనిట్లకు పైగా కరెంటు వాడే వినియోగదారులకు, మలిదశలో 200 యూనిట్లకు మించి వాడే వినియోగదారులకు అమలు చేయాలని చూస్తున్నారు.
ఎన్నికల రాకతో మారీన సీన్
ప్రీపెయిడ్ మీటర్లను ప్రతి వినియోగదారుడి కనెక్షన్కూ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.కానీ ఎన్నికల నేపధ్యంలో ఈ ప్రతిపాధన కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.ఈ ప్రతిపాధనతో ప్రజల్లో నిరసన ఎదురైతే కేంద్రానికి నష్టం జరుగుతుందని భావించి ప్రస్తుతం అమలుకు తాత్కాలిక బ్రేక్ను వేశారు.ఇప్పడు ప్రయోగాత్మకంగా తెలంగాణ సర్కార్ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్నా.. రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విసృతం చేయడం ఖాయంగా కనబడుతుంది.దీనికి అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు.వీటి ఏర్పాటుతో మొండి బకాయిలనుంచి ఉపశమనం కలుగడంతో పాటు ,ఎంత కరెంటు వాడుకోవాలన్న దానిపై వినియోగదారులకు స్పష్టత ఏర్పడి పొదుపు చేస్తారన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు..