Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
కళలు బోధనాంశంగా ప్రాథమిక స్థాయిలో నే పాట్యాంశాలలో చేర్చాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (నల్గొండా) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్యాత్మిక సాహిత్య, సాంస్కృతిక అధ్యయన, పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 'విద్యాసంస్థల్లో ప్రదర్శనా కళల ఆవశ్యకత' జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా సదస్సును ప్రారంభించిన ప్రొఫెసర్ ఖాజా మాట్లాడుతూ మానవీయ విలువలను పెంపొందించేవి కళలేనన్నారు విశ్వవిద్యాలయాలలో కళలకు ప్రత్యేక శాఖ ఉంటుందని కానీ ప్రతి విధ్యార్థి ఏదో ఒక కళ నేర్చుకునే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధ్యక్షత వహించిన సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యసంస్థల్లోను కళలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ బాలకృష్ణ పాల్గొన్న సభలో ఆర్ఎఫ్డీఎల్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ కీలకోపన్యాసంలో అన్ని విద్యాంశాలతో పాటు కళా ప్రక్రియలకు కూడా మార్కులు కేటాయించాలని సూచించారు. గణితం, సైన్స్ ఇతర సబ్జెక్టుల వలెనే ఏదో ఒక కళలో విద్యార్థి నేర్చుకుని ఉత్తీర్ణుడు కావాలని, అటువంటి ప్రణాళిక రూపొందించాలన్నారు. నాట్య గురువులు డాక్టర్ రత్నశ్రీ, డాక్టర్ వనజా ఉదరు పౌరాణిక నాటక ప్రముఖుడు డాక్టర్ కుట్టి వెంకటాచారి, రంగస్ధల నటుడు మల్లాది భాస్కర్, హిందుస్తానీ గాయకురాలు వందన. రంగస్థల కళాకారిణి డాక్టర్ హెచ్కే వందన, తదితరులు ప్రసంగించారు.