Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి
నవతెలంగాణ-రాంనగర్
రాజీలేని గొప్ప ఆదర్శవాది డాక్టర్ మనోహర్ లోహియా అని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం బాగ్లింగంపల్లిలో జీఎస్టీ ఫంక్షన్ హాల్లో మనోహర్ లోహియా విచార్ మంచ్ ఆధ్వ ర్యంలో 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లా డుతూ వంద రోజులు కాలేదు ఎంత మంది ఎమ్మె ల్యేలు మారుతున్నారో చూస్తున్నామని లోహియా బతికి ఉంటే సత్యం కోసం నిరంతరం పోరాటం చేసే వారు అన్నారు. .మాజీ హౌంమంత్రి నాయిని నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బి జనార్దన్ రెడ్డి, లోహియా విచార్ మంచ్ ప్రధాన కార్యదర్శి ఎంపల్లి నారా యణ, కార్యనిర్వాహక కార్యదర్శి శంకర్ లాల్ యాదవ్, సోషలిస్టు నాయకులు గోపాల్ కింగ్, రావెల సోమయ్య వి. బాబురావు పాల్గొన్నారు.