Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 825మంది విద్యార్థులకు ఉపాధి కల్పించడంపై అభినందనలు
- తెలంగాణ ఉన్నత విధ్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే విధంగా విద్యాసంస్థల యాజమాన్యాలు కృషిచేయాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ విద్యాసంస్థలో శనివారం రాత్రి జరిగిన సినార్జి 2కే19 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంచి ఇన్ఫ్రాస్టక్చర్, బోధన సిబ్బంది అన్ని వసతులు కల్పించినపుడే విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోగలరని అన్నారు. అలాంటి వసతులు కల్పించిన అనురాగ్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ అకాడమిక్లో 825 మంది విద్యార్థులకు వివిధ కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పించిన అనురాగ్ యాజమాన్యం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కార్యదర్శి పల్ల నీలిమా, అతిథి సముహ క్రియేషన్ లిమిటెడ్ చైర్మన్ ప్రశాంత్ అరుణ్ సాయి, డైరెక్టర్ కే.ఎస్,రావు, డిప్యూటీ డైరెక్టర్ విష్ణుమూర్తి, ఎగ్జామినేషన్ డీన్ ముత్తారెడ్డి, వివిధ విభాగధిపతులు వసుధ భక్షి, చలపతి, విజరు కుమార్, అకాడమిక్ కో ఆర్డినేటర్ మహిపతి శ్రీనివాస్ రావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ చెన్నకేశవ మల్లేష్, నవీన్, పీడీ తారక్, తదితరులు పాల్గొన్నారు.