Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్బాగ్లో కొనసా గుతున్న ఆర్యూబీ నిర్మాణ పనులను శనివారం నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బండ చెరువును పరిశీలించి గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. చెరువు చుట్టూ పక్కల వేస్తున్న చెత్త చెదారం వల్లే దోమలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికుల వినతి మేరకు దోమల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. చెరువు సుందరీకరణకు అధికారులు ప్రణాళకలు సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్కుమార్, బద్దం పరశురాం రెడ్డి, సతీష్, బాబు, సత్యనారాయణ, లక్ష్మికాంత్ రెడ్డి, ఆనంద్ బాబు, అశోక్, గోపాల్, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.