Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకంగా ఓటేసిన16 మంది ఎంపీటీసీలు
- అవిశ్వాసం నెగ్గింది..కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి
- రాజకీయ స్వార్థం కోసమే ఆవిశ్వాసం
- కీసర ఎంపీపీ ఆర్.సుజాత
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర ఎంపీపీ రామరం సుజాతపై అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఆవిశ్వాస తీర్మానం పెట్టారు. శనివారం మండల పరిషత్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 19 మంది ఎంపీటీసీలు హజరైయ్యారు. వీరిలో దమ్మాయిగూడ ఎంపీటీసీ నవనీత ఒక్కరే హజరు కాలేదు. మొత్తం 19 మందిలో 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ సుజాతకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి ఆమె తన పదవీని కొల్పొయారు. ఈ విషయాన్ని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి ధృవీకరించారు. అనంతరం అవిశ్వాస తీర్మానం కాపీలను పంచాయతీ రాజ్ కమిషన్కు చేరవేసిన అనంతరం కమిషనర్కు పంపించ నున్నట్టు తెలిపారు.కమిషనర్ ఆదేశాల మేరకు తదుపరి ఎంపీపీ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు .
రాజకీయ స్వార్థం కోసమే ఆవిశ్వాసం :
దళిత మహిళ ఎంపీపీ కావడం ఇష్టంలేకనే రాజకీయ స్వార్థం కోసం తనపై అవిశ్వాసం పెట్టారని కీసర ఎంపీపీ ఆర్.సుజాత అన్నారు. శనివారం కీసర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దళిత ఎంపీపీని అణగ దొక్కేందుకు కొందరు అగ్రవ ర్ణనేతలు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. మండల పరిషత్ సమావేశాలకు హాజరుకాని సభ్యులు తనపై ఏవిధంగా ఆవిశ్వాసం పెడతారని మండిపడ్డారు. అధికార పార్టీలో జరిగిన అవమానంతో తాను త్వరలోనే పార్టీని వీడనున్నట్టు తెలిపారు.