Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాలానగర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బాలానగర్ కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య అన్నారు. మంగళవారం ఫిరోజ్గూడలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ, సిబ్బందితో పాటు స్థానికులు పాల్గొన్నారు.