Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా అన్నారు. మంగళవారం అధికారులతో కలిసి పనులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా తన దష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి లడ్డు రమేష్ గౌడ్ పాల్గొన్నారు.