Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యుల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని ఎన్ఎల్బీ నగర్ కమిటీ అధ్యక్షులు కేపీ వెంకటేష్ గౌడ్ తెలిపారు. సోమవారం న్యు లాల్ బహదూర్ నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కమిటీ అధ్యక్షుడిగా కేపీ వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అఖిల్ గౌడ్, కోశాధికారిగా గౌతమ్ గెలుపొందారు. అనంతరం ఎన్నికల కమిటీ వారు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, కార్య దర్శులు మాట్లాడుతూ.. రానున్న రెండేండ్లలో ఎన్ఎల్బీ నగర్లో నెలకొన్న సమస్య లన్నింటినీ పరిష్క రిస్తామని హామీనిచ్చారు. తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.