Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాలానగర్
మూసాపేట సర్కిల్ పరిధిలోని దీనదయాల్ నగర్ నుంచి భరత్నగర్ వరకు వేసిన బీటీరోడ్డును మంగళవారం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాటర్ వర్క్స్ దిమ్మెలు రోడ్డుకు సమానంగా చేయడం వల్ల రోడ్డు వెడల్పు అవడంతో పాటు ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నాలాలో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని అసోసియేషన్ సభ్యులు కోరగా, అందుకు అంచనాలు తయారు చేయించి త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. కార్పొరేటర్ స్పందన పట్ల అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.