Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మియాపూర్
డ్రైవర్ సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ మియాపూర్ ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు జె లక్ష్మీ నారాయణ, భిక్షపతి, రాజులు మాట్లాడుతూ.. ఏప్రిల్ 12వ తేదీన పటాన్చెరులోని గవర్నమెంట్ హాస్పిటల్ యూటర్న్ దగ్గర మియాపూర్ డిపోకు చెందిన బస్ వెనుక భాగాన తగిలి ఒకరు మృతిచెందిన సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ ఎండీ సాబీర్ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బస్సు వెనుక భాగంలో ఢకొీని ఎవరైనా మృతి చెందితే దానికి కారణం డ్రైవర్ కాదని గతంలో అనేక తీర్పులు ఉన్న్డాయని గుర్తు చేశారు. మియాపూర్ డిపో ఎండీ మధుసూదన్ చిన్న అవకాశం దొరికితే కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు ప్రకటనలో తెలిపారు.