Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందానగర్
మంజీర పైపులైన్ లీకేజీ మరమ్మతు పనులను త్వరితగతిన చేపట్టి సమస్య పరిష్కరిస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ పోచమ్మ ఆలయం వద్ద లీకేజీ అవుతున్న మంజీరా నీటి పైపులైన్ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. పైపులైన్ పగిలిపోయిన నీరు వృథా అవుతుండటంతో నీటి సరఫరాను నిలిపివేసి బుధవారం నాటికి పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని వాటర్ వర్క్స్ అధికారులను కార్పొరేటర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశం గౌడ్ తదితరులు ఉన్నారు.