Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ నాయకులు జక్కా వెంకట్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు వినతి పత్రం అందచేశారు. ట్రాఫిక్ ఏసీపీని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన ఎసీపీ ఉప్పల్ ట్రాఫిక్ సీఐని ట్రాఫిక్ సమస్యకుగల కారణాలు పరిశీలించటానికి గానూ ఫీర్జాదిగూడ నుంచి చెంగిచెర్ల వరకూ పరిస్థితిని కనుక్కోవాలని అదేశించారు. దీంతో ట్రాఫిక్ సీఐ కాశి విశ్వనాధ్, ఫీర్జాదిగూడ కమిషనర్ వాణిలతో కలిసి సమస్యను పరిశీ లించారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నిర్మళ, మనోరంజన్ రెడ్డి,రఘువర్ధన్ రెడ్డి లు తదితరులు పాల్గొన్నారు.