Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీఎస్ బోస్
నవతెలంగాణ-నాచారం
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీఎస్బోస్ అన్నారు. మంగళవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాల్కయ్య అధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి వంట సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు కేజీటూ పీజీ ఉచిత విద్య అంటూనే మరొక వైపు విద్యా రంగాన్ని పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సృహ కల్గిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి తోడ్పాటునందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు విఎస్ఎస్ రెడ్డి, సీతా రాంరెడ్డి, దుర్గాయాదవ్, ఇన్సాఫ్ జిల్లా నాయకులు కాశీం, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సత్యప్రసాద్, రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు రజిత, హిమబింధు పాల్గొన్నారు.