Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాప్రెడ్డి
నవతెలంగాణ-సుల్తాన్బజార్
నిమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, వైద్యులపై రోగి తరఫు బంధువులు దాడి చేయడం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోఠిలోని ఐఎంఏ వద్ద దాడిని ఖండిస్తూ అందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం తెల్లవారు జామున నిమ్స్ ఆస్పత్రికి అక్సిడెంట్తో గాయపడి నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లపై రోగి బంధువులు మద్యం మత్తులో కొందరు డాక్టర్ అన్వేష్, డాక్టర్ ఫాతీమాలను దూషిస్తూ, దాడి చేయడం దారుణం అన్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హోం మంత్రి దృష్టి సారించి వైద్యులకు రక్షణ కల్సించాలని డిమాండ్ చేశారు. నిమ్స్ డాక్టర్లపై దాడి జరిగితే ఆస్పత్రి డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలసి ఉందన్నారు. కాని ఆయన కాకుండా దెబ్బలు తిన్న డాక్టర్రే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. డైరెక్టర్కు బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సంజీవ సింగ్ యాదవ్, కోశాధికారి డాక్టర్ శివలింగం, డాక్టర్ మహేష్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ సంపత్రావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.