Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యార్థులతో కవాతులు నిర్వహించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించటం అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా పాఠశాలల విద్యార్థు లతో కవాతులు నిర్వహిస్తే వేసవి ఎండల వల్ల విద్యార్ధులు ఇబ్బంది పడతారని సీఎం ఆలోచన చేయటం శుభపరిణామమని అన్నారు. అదే విధంగా వివిధ కార్య క్రమాలకు విద్యార్థులను గంటల తరబడి నిలబెట్టటం, వారిని ఇబ్బంది పెట్టటం సరికాదని, ఇకపై ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా విద్యార్ధులకు ఇబ్బంది కలుగకుండా పాఠశాల యాజమాన్యాలు చూడాలనే ముఖ్యమంత్రి ఆదేశాలను ప్రతి పాఠశాలలో అనుసరించాలని కోరారు. జూన్ 1 నుంచి తెలంగాణాలో పాఠశాలలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎండల దృష్ట్యా వేసవి సెలవులను మరికొంత పొడిగించాలని విఙ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా పాఠశా లలను జూన్ 12 నుండి పున: ప్రారంభిస్తే ఎండ తీవ్రత తగ్గుతుంది కావున విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. తెలంగాణా ప్రభుత్వం వేసవి సెలవుల పొడిగింపుపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.