Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
లాసెట్ ఫలితాలను జూన్ రెండు లేదా మూడో తేదీన విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ఆచార్య జీబీ రెడ్డి తెలిపారు. ఈ నెల 23 మధ్యాహ్నం 11 గంటలకు నుంచి 25 వరకు లాసెట్ కీని టీఎస్ వైబ్సెట్లో పొందుపరుస్తామన్నారు. అభ్యంతరాలు ఎమైనా ఉంటే వాటిని స్వీకరించి, పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు జూన్ 2 లేదా 3న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ తెలిపారు .