Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పంజాగుట్ట
వరల్డ్ మిస్సెస్ యూనివర్సిటీ ఫైనల్ పోటీలకు తాను ఎంపికయినట్టు రోహిణి నాయుడు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రపంచ మిస్సెస్ యూనివర్సిటీ పోటీలకు అన్ని దేశాల నుంచి మొత్తం 30వేల మంది దరఖాస్తు చేసుకోగా 172మంది ఫైనల్ పోటీలకు సెలెక్ట్ చేశారన్నారు. అందులో తాను కూడా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆక్టోబర్ నెలలో జరిగే ఈ పోటీలు గ్రీసు దేశంలో నిర్వహిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆమె రోహిణి సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఉందని పలువురు తెలిపారు. ఈ పోటీలలో భాగంగా నాలుగు వారాలు వ్యక్తిత్వ వికాసం మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ, అపోహలు తొలగించడం అనే అంశాలపై ఒక్కొక్క వారం ఒక్కొటి చొప్పున నాలుగు టాస్క్ లు చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు ఆమె తెలిపారు.