Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పండుగలు మత సామరశ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పులిజగన్ అన్నారు. మంగళవారం డివిజన్లోని బాపునగర్లో షేక్ జమీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కార్పొరేటర్ పులి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ పండుగలు సాంప్రదాయ బద్ధంగా జరుపుకునేందుకు నిధులు కేటాయిస్తున్నారన్నారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్యాదవ్, ముస్లిం మైనార్టీ సోదరులు మహ్మద్ గౌస్, మహ్మదీ, ఎంఐఎం నాయకులు అత్తార్ హుస్సేన్, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.