Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరి ంచాలని రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ రవి వారిని ఆదేశించారు. మంగళవారం సాయత్రం నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏజెంట్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, 7 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వివరించారు. ఏజెంట్లు కౌంటింగ్ రోజు ఉదయం 6.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్గౌడ్, బీజేపీ తరఫున చింతల రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.