Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చాధర్ఘాట్
ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాధర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విజయనగరానికి చెందిన ఏ.బాలాజీ (35) చాధర్ఘాట్లోని వినాయక వీధిలో నివాసం ఉంటూ మలక్పేట్ రేస్ క్లబ్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.