Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట
మైనర్బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలంటూ వేదింపులకు గురి చేసిన యువకున్ని అరెస్టు చేసిన ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సాయిప్రకాశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శివన్నగూడం, ఇందుర్తి గ్రామానికి చెందిన ఉర్రిపాక వినోద్కుమార్(24) ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి చంపాపేటలోని గాంధీ విగ్రహం సమీపంలో నివాసముంటున్నాడు. ఎన్టీఆర్నగర్ ప్రజరు ప్రిన్సిటన్ టవర్స్లోని ఓ ఫిజ్జా సెంటర్లో గతేడాది వినోద్కుమార్ పని చేసే సమయంలో బాలిక ఆ సెంటర్కు వచ్చింది. పరిచయం పెంచుకొని అప్పటినుంచి వేదింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. వేదింపులు తీవ్రతరం చేసి ఈనెల 17న మధ్యాహ్నం సమయంలో ఆ మైనర్ బాలికను కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రి సమీపం వద్దకు పిలిపించి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలంటూ వేదింపులకు గురిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈనెల 20న వినోద్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్సై సాయిప్రకాశ్గౌడ్ తెలిపారు.