Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేపీహెచ్బీ
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనగామ జిలా,్ల నర్మెట్ట మండలం, వెల్దండ గ్రామానికి చెందిన రెక్కల ముత్యం రెడ్డి (55) కొంతకాలంగా నగరంలోని కూకట్పల్లి సర్కిల్ పరిధి, రామారావు నగర్లో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతను కొన్నేండ్లుగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ, వ్యవసాయం చేస్తుండేవాడు. అయితే కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవడం, అదీగాక ఏప్రిల్లో కురిసిన వడగండ్ల వర్షానికి వ్యవసాయంలోనూ తీవ్ర నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన ఈ నెల 17వ తేదీన ఆయన నివాసంలో గుర్తు తెలియని విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు రామ్దేవ్ రావు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 20వ తేదీ రాత్రి 10:55 గంటలకు చనిపోయాడు. మతుడి కుమారుడు పరమేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.