Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
రైల్వే ఇంజినీరింగ్ కార్మికుల అభివృద్ధికి శంకర్రావు చేసిన కృషి మరువలేనిదని సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ కొనియాడారు. మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ఎండనకా, వాననకా పట్టాల వెంబడి శ్రమిస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల కష్టాన్ని, ఆవేదనను అర్ధం చేసుకొని వారికి ప్రమోషన్స్ ఇప్పించిన ఘనత ఆయనకే చెందుతున్నారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ.. సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ కార్మికుల సమస్యలను గుర్తించి, తన దృష్టికి తీసుకురావడంలో ముందున్నారని, డివిజన్ సమస్యలు పరిష్కరించడంలో సఫలమయ్యారన్నారు.