Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మారేడ్పల్లి తహసీల్దార్ కార్యాల యంలో స్పెషల్ ఆర్ఐ ఉమర్ను లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికా రులు మంగళ వారం అదుపులోకి తీసుకు న్నారు. అతనిపై లంచం తీసుకున్నట్టు పలు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజుల క్రితమే ఓ మహిళను కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో ఇబ్బంది పెడుతున్నట్టు ఏసీబీ అధికారుల దృష్టికి రావడంతో వారు రంగం లోకి దిగి అతన్ని పట్టుకున్నారు. మరో కేసులో తుకారాం గేటుకు చెందిన సుధారాణి అనే మహిళ వద్ద ఉమర్ 7వేలు లంచం తీసుకు న్నాడు. ఈ కేసుల్లో అతనికి సహకరి ంచిన అటెండర్ను కూడా సస్పెండ్ చేస్తు న్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ నిమిత్తం ఉమర్కు సంబంధించిన పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం విచారణ నిమిత్తం మారేడ ్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లను పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.