Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ తలారి మల్లేష్
నవతెలంగాణ-గండిపేట్
నేక్నాంపూర్లోని పెద్ద చెరువు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీపీ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండలంలోని నేక్నాంపూర్ పెద్ద చెరువును పరిశీలించారు. వచ్చే వర్షాకాలంలోపు చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్షాలు రాకముందే చెరువును అభివృద్ధిలోకి తీసుకరావాలన్నారు. కేటీఆర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవతో చెరువు అభివృద్దికి నొచుకొందన్నారు. ప్రజలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే చెరువులో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. నేక్నాంపూర్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెరువును సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె. రామకృష్ణారెడ్డి,మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, సీనియన్నాయకులు జయరాజు, మాజీ డైరెక్టర్ నిలేష్దూబె, తదితరులు పాల్గొన్నారు.