Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాబాద్ వ్యవసాయ అధికారి వెంకటేషం
నవతెలంగాణ-షాబాద్
రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని షాబాద్ వ్యవసాయాధికారి వెంకటేషం తెలిపారు. షాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని రైతులు పచ్చిరొట్ట సాగుచేసుకుని భూమిని సారవంతం చేసుకోవాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుములు 250 క్వింటాళ్లు, జిలుగ 50క్వింటాళ్లు మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. 65శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జనుములు మార్కెట్లో రూ.6850 ఉండగా రాయితీతో రూ.2398కి, జిలుగా మార్కెట్లో రూ.5150 ఉండగా రాయితీపై రూ.1800లకు ప్రభుత్వం అందజేస్తున్నట్టు తెలిపారు. కావల్సిన రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లు తీసుకొని, అలాగే వ్యవసాయ కార్యాలయంలో పర్మిట్ తీసుకుని, పీఏసీఎస్ షాబాద్ భవనంలో విత్తనాలు తీసుకోవాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.