Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం సమస్యలు పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్కు మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఒకటి లేదా రెండు మోడల్ కాలనీలను తయారు చేయాలని కోరారు. కాలనీలో మున్సిపల్ అధికారులు ఇంకుడు గుంతలు, చెట్లు పెంచేలా కాలనీవాసులను ప్రేరేపించాలన్నారు. కాలనీలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీల్లో ఏ సమస్య వచ్చినా కార్పొరేషన్ అధికారులు వచ్చి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించా లన్నారు. అభివృద్ధి చెందని, సదుపాయాలు లేని కాలనీలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మోడల్ కాలనీల్లో ప్రతినెల మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సమా వేశానికి అందరూ హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందిం చిన కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. తప్పకుండా మున్సిపల్ సిబ్బంది సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమ ంలో అనంతుల రాజీరెడ్డి, చింతల రవికుమార్, సంజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.న