Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
టీఎస్ఆర్టీసీలో వెంటనే గుర్తింపు యూనియన్ ఎన్నికలు(వెరిఫికేషన్) జరుపాలని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో టీజేఎంయూ నాయకులు మంగళవారం లేబర్ కమిషనర్ కార్యాలయం అంజయ్య భవన్లో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రిటర్నింగ్ అధికారి గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. టీఎంయూ గుర్తింపు కాలం అయిపోయి దాదాపు పది నెలలు అవుతుందన్నారు. గుర్తింపు ఎన్నికలు జరుపనందున కార్మికుల సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఆర్టీసీలో కొత్త బస్సులు లేక, రిక్రూట్మెంట్ లేక పెరిగిన పని భారంతో సిబ్బంది అనేక కష్టాలు పడుతున్నారన్నారు. ఈ నెల 23 తరువాత ఆర్టీసీలో ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్టు కమిషనర్ గంగాధర్ తెలిపినట్టు వివరించారు. కార్యక్రమంలో టీజేఎంయూ సంయుక్త కార్యదర్శులు రవీందర్, నర్సయ్య, సిటీ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి, టీజేఎంయూ నాయకులు కైలాసం తదితరులు పాల్గొన్నారు.