Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు పూర్వ గవర్నర్ కే.రోశయ్య
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
విద్యార్థులపైనే దేశ భవిత ఆధారపడి ఉంటుందని తమిళనాడు పూర్వ గవర్నర్ కే రోశయ్య అన్నారు. సృజన ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థ నేతృత్వంలో నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆ ర్ కళామందిరంలో జరిగిన ప్రతిభా పురస్కా ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోశయ్యతో పాటు ప్రముఖులు రుద్రరాజు పద్మరాజు, వకులాభరణం, రవితులసీరెడ్డి, నరేందర్, ఎం.రామలకిë, నూక ఆదినారాయణ, వేణు గోపాల స్వామి హాజరయ్యారు. ఈ సందర్భ ంగా పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏతో ప్రతిభ కనబరిచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్కు చెందిన చైతన్య విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారా లను ముఖ్య అతిథులతో కలిసి రోశయ్య ప్రదానం చేయ డంతో పాటు సన్మానించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో చదివితే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడవు తాడని అన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల కరస్పాండెంట్, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరిని శాలువాతో సన్మానించి అభిన ందించారు. ఈ కార్యక్రమ ంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.