Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న బస్తీవాసులు
- పట్టించుకోని వాటర్ వర్క్స్ అధికారులు
నవతెలంగాణ-సికింద్రాబాద్
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పుర బస్తీలో తాగునీరులేక బస్తీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. బస్తీలో వారం రోజులకు ఒకసారి మంచి నీరు వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఆ బస్తీని దత్తత తీసుకున్నాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని స్థానికులు వాపొయారు. ఇప్పటికైనా అధికారులు బస్తీలో ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతు న్నారు. తారునీరు రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా తమ జీవనాన్ని వెల్లదీస్తున్నా మని, అయినా అధికారులు నిర్లక్ష్యంతో తమ బస్తీలోకి ట్యాంకర్లు కూడా రావడంలేదని అన్నారు. గత వారం రోజులుగా తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు వారు తెలిపారు. ప్రస్తుతం డ్రమ్ములు ఏర్పాటు చేసుకుని వాటర్ ట్యాంకర్ వచ్చిన్నప్పుడు నింపు కుంటున్నామన్నారు. వాటర్ వర్క్స్ అధికారులు రసూల్పురకు తాగునీరు పంపించడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహ రిస్తున్నారని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వారు ఉన్న కాలనీలోకి వాటర్ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారని, పేదలు ఉంటున్న కాలనీలలో మంచినీరు తెప్పించడంలో ఎవరూ చొరవ చూపించడం లేదని విమర్శించారు. గతంలో సీఎం కేసీఆర్ రసూల్పురలో సభ ఏర్పాటు చేసి రసూల్ పురను దత్తత తీసుకుంటున్నామని చెప్పిన ప్పుడు తమ తలరాతలు మారుతాయని చాలా సంతోషించామని కానీ ఇప్పుడు ఆ ఆనందం కొంచెం కూడా లేదన్నారు. బస్తీలో నీరు లేక రాత్రిపగలు రోడ్లపై వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నామని స్థానికులు చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని వారు కోరుతున్నారు.
సీఎం దత్తత గ్రామంలోనే ఇలా ఉంటే ఎలా..
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలోనే తాగునీటి ఇబ్బందులు ఉన్నాయంటే మిగతా ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఎంటీ. రసూల్పురను అభి వృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు పటించుకోలేదు. అసలే ఎండకాలం పైగా బోర్లల్లో కూడా నీరు రావడంలేదు మమ్మల్ని ఆదుకునేవారేవరు..
- భారతి
ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి..
రసూల్పుర బస్తీ లో ఎన్నికల ముందు అనేకమంది నాయ కులు వచ్చి మీకు అది చేస్తాం, ఇది చేస్తామని ఓట్లు వేయించుకుని మమ్మ ల్ని పట్టించుకోవడం మానేశారు. కనీస అవస రాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో మేం ఉన్నాం. కావున ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
- సునీత
వారం రోజులుగా నీరు రావడం లేదు..
రసూల్పుర బస్తీ లో వారం రోజు లుగా తాగునీరు రావ డంలేదు. బస్తీలోనే డ్రమ్ములు ఏర్పాటు చేసుకొని రెండు, మూడు బిందెల నీటిని వాటర్ ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుని తాగుతున్నాం. ఇప్పటికైనా వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
- లక్ష్మి